మహబూబ్నగర్ వచ్చినప్పుడల్లా రేవంత్ నన్ను అవమానిస్తున్నారు : డీకే అరుణ

-

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్నటి పర్యటనలో తనపై చేసిన విమర్శలపై మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయటం తప్పితే.. జిల్లాకు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు. రేవంత్ తన ప్రచారంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించడం లేదని.. తమపై విమర్శలు చేయడం తప్ప ఆయన వద్ద మాట్లాడ్డానికి ఏం లేదని మండిపడ్డారు. ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో మళ్లీ ప్రజల్లో వద్దకు వస్తున్నారని.. మరిన్ని అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడుసార్లు పర్యటించారు. ఆయన వచ్చినప్పుడల్లా నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారు. నన్ను చూస్తే రేవంత్‌ రెడ్డికి ఎందుకు కడుపు మంట? నా రక్తం గురించి కూడా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. నాపై వ్యక్తిగత విమర్శలు చేయటం తప్ప…. పాలమూరు జిల్లాకు రేవంత్‌రెడ్డి చేసిందేంటి? ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను ఎక్కడా ప్రస్తావించటం లేదు? అని ముఖ్యమంత్రిపై డీకే అరుణ ఎదురు దాడికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news