ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఎల్లోమీడియా పిల్లిమొగ్గ‌లు….బెడిసికొడుతున్న చంద్ర‌బాబు ప్లాన్

-

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉత్తుత్తి ప్ర‌చారం ఆ పార్టీ పెద్ద‌ల‌కు బెడిసికొట్టేలా క‌నిపిస్తోంది.అటు అనుబంధ ఎల్లో మీడియా కూడా ఈ విష‌యంలో పిల్లిమొగ్గలు వేస్తోంది.ఎలాగైనా ప్రజలను మెప్పించి ఓట్లు రాబ‌ట్టుకోవాల‌ని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే….కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం…రైతులకు చుట్టం అని వ్యాఖ్యానించేశారు.అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు అనే విష‌యం ఇప్పుడు టీడీపీకి బోధ‌ప‌డుతోంది. భూములు..

స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడన‌క్కర్లేదంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు…భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు ..చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు.. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు… బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు..

ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్…అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు. అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు.ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.

తీరా ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో ఎల్లో మీడియా ముందుటోంది. ఒక‌ప్పుడు ఆ మీడియానే ఈ చ‌ట్టం గొప్ప‌ద‌ని కథనాలు ఇచ్చారు… ఇప్పుడు అదే మీడియాలో ఈ చట్టాన్ని భూతంలా చూపిస్తూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ల్ళిస్తున్నారు. అంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే ఎల్లో మీడియా ఎంత‌వ‌ర‌కైనా దిజారుతుంది అనేందుకు ఈ వ్య‌వ‌హార‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు. ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు…అంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ…ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు.అయితే ఇప్పుడు సీఎం జ‌గ‌న్ దీనిపై క్లారిటీ ఇవ్వ‌డంతో అస‌లు విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది.ఓట్లు చేజారిపోయే అవ‌కాశం ఉండ‌టంతో చంద్ర‌బాబు పునారాలోచ‌న‌లో ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news