తెలంగాణ ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. త్వరలోనే ఆ పథకం !

-

ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని..సాధ్యమైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నానని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఐదేళ్లలో 73 % ఫిట్ మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి వేతనాలు లేవు. కేవలం తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామన్నారు.

ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రోజూ ఇంటింటికీ తాగునీరు అందివ్వలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప అని .. తెలిపారు.ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథకు బహుమతి అందించింది…మన రాష్ట్రంలో 12% బడ్జెట్ ను విద్య రంగం పై పెట్టడం గర్వ కారణమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వము కాపీ కొట్టి అమలు చేస్తున్నది.పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపిలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు అందించాలని అసె0బ్లీలలో అడుగుతున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 30 వేల కోట్లు బకాయిలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news