మ‌ల్కాజ్‌గిరిలో దుమ్ములేపుతున్న ఈటల.. 11 వేల ఓట్ల ఆధిక్యం

-

BREAKING: కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ దుమ్ములేపుతున్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ 11 వేల ఆధిక్యంతో దూసుకెళుతున్నారు.

Etala rajendhar

ఇక అటు వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ లీడింగులో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలిరౌండులోనూ ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి శివుడికి అత్యంత ఇష్టమైన నగరంలో రికార్డులు సృష్టించడం ఖాయమే. 2014, 2019లోనూ ఆయన భారీ మార్జిన్‌తో గెలుపొందడం విశేషం. ఇక్కడ ఆయన స్థాయికి తగిన ప్రత్యర్థి లేకపోవడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news