అమిత్ షా సభను బహిష్కరించిన ఈటల వర్గం !

-

అమిత్ షా సభను బహిష్కరించేందుకు సిద్ధమైంది ఈటల రాజేందర్ వర్గం. తాజాగా బిజేపిలో ప్లెక్సీ వివాదం నెలకొంది. ఇవాళ ఖమ్మం లో అమిత్ షా బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లలో ఈటల రాజేందర్‌ ఫోటో కనిపించలేదు. గ్రౌండ్ లోపల ఏర్పాటు చేసిన ప్లెక్సిల్లో ఈటల రాజేందర్ ఫోటో లేకపోవడంతో వివాదం చెలరేగింది.

దీంతో అమిత్ షా బహిరంగ సభను బహిష్కరిస్తామని హెచ్చరికలు చేసింది ఈటల వర్గం. అంతేకాదు… స్టేట్ కమిటి, జిల్లా కమిటీ సభ్యులు కూడా అలక బునారు. జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ…ఫోటో పెడదాం! అంటూ బుజ్జగింపులకు దిగారు. ఇవాళ ఉదయం లోపు ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పారు గల్లా సత్య నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news