నేడు తెలంగాణకు అమిత్‌ షా.. షెడ్యూల్‌ ఇదే

-

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌ షా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే..ఇవాళ ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్‌ షా చేరుకుని.. అక్కడ నుంచి హెలికాప్టర్ లో 2.10 గంటలకు కొత్తగూడెం చేరుకుని.. రోడ్డు మార్గంలో భద్రాచలంకు అమిత్ షా వెళ్తారు.

2.25 నుంచి 2.40 వరకు సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరిగి భద్రాచలం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెం వెళ్లి.. అక్కడి నుంచి 2.55 కు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో బయలుదేరి‌ 3.30కు ఖమ్మంకు చేరుకుంటారు. ఇక, మధ్యాహ్నం 3.45 నుంచి 4.35 వరకు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. వ్యవసాయ రంగానికి, రైతులకు ఏమీ చేస్తారో ఆయన ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news