తెలంగాణలో ప్రతీ నీటి బొట్టు కాంగ్రెస్ పార్టీదే : భట్టి విక్రమార్క

-

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో బస్సు యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ బస్సు యాత్రలో భాగంగా పెద్దపల్లిలో బహిరంగసభకు హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి.. 1లక్ష 25వేల ఖర్చుచేశారు. వరి ధాన్యాన్ని పండించే రైతులకు చెబుతున్నాను.. ప్రతీ నీటిబొట్టు కాంగ్రెస్ పార్టీదే.. కడియం కాంగ్రెస్ పార్టీ కట్టింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించింది.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖర్చు చేసింది ఎక్కువ.. ప్రాజెక్టులు నిర్మించింది తక్కువ అన్నారు భట్టి విక్రమార్క. అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులను గెలిపించాలని కోరారు. రైతులను ఆదుకుంటామని.. రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ మోసగించాలని ప్రయత్నం చేస్తున్నారు.రూ.5కోట్ల అప్పులు చేయలేదు.. కాంగ్రెస్ అన్ని ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తు చేశారు భట్టి.

Read more RELATED
Recommended to you

Latest news