మూకుమ్మడిగా పరిగి తహసీల్దార్ కార్యాలయానికి అందరూ డుమ్మా..!

-

వికారాబాద్ జిల్లా పరిగి తహశీల్దార్ కార్యాలయంలో ముకుమ్మడిగా అధికారులు డుమ్మా కొట్టారు. చిన్న స్దాయి అధికారి నుంచి పెద్ద స్దాయి అదికారి తహశీల్దార్ వరకు ఎవరు లేకపోవడం గమనార్హం. ఒక్కసారిగా అందరు గైర్హాజరు కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న జరిగిన రిజిస్ట్రేషన్ పై పలు ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దాదాపు 45 కోట్ల విలువ భూమి పై రాజకీయ నాయకుల కన్ను పడినట్టు తెలుస్తోంది. అసలు సీలింగ్ లో ఉన్న భూమి  రీలిజ్ ఎలా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. తహశీల్దార్ కార్యాలయంలో కాకుండా రిజిస్ట్రేషన్ బయట చేశారని ఆరోపణలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ జరిగిందని ఓ అధికారి పేర్కొంటున్నారు. కానీ సీసీ ఫుటేజ్ అడిగితే మాత్రం నోరు మేదపడం లేదని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి తహశీల్దార్ కార్యాలయంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

పరిగి మండలం రాఘవాపూర్ గ్రామ సర్వే నెం నెం 94,95,96 నెం లో గల 22 ఎకరాల భూమి  తమకు అగ్రిమెంట్ చేసిన ఇప్పుడు భూమిని తమకు తెలియకుండా వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారని నిన్న ఆందోళనకు దిగారు  బాధితులు. అగ్రీమెంట్ చేసుకున్న వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిన్న పెట్రోల్ పోసుకోని అత్మహత్య యత్నం చేశారు. గ్రామస్తుల, పోలీసుల మధ్య నిన్న తోపులాట చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news