జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ – మంత్రి తలసాని

-

జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసానితో భేటీ అయ్యారు బత్తిన సోదరులు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారని వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news