మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

-

నల్గొండ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని అయిదుగురు మృతి చెందగా.. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చెరుపల్లి మహేశ్‌.. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి ఈ కారును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో నాలుగు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news