ప్రధాని మోడీతో కిరణ్ కుమార్ రెడ్డి..ఫోటో వైరల్

-

 

ఇవాళ తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. కాసేపటి క్రితమే.. వరంగల్‌ కు చేరుకున్నారు ప్రధాని మోడీ. వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో విజయ సంకల్ప సభలో కూడా పాల్గొన్నారు. అయితే.. ఇక్కడే ప్రధాని మోడీకి కేసీఆర్‌ సర్కార్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రులు స్వాగతం పలకలేదు… అటు సీఎం కేసీఆర్‌ రాలేదు.

మొదట తలసాని శ్రీనివాస్‌ మంత్రి స్థాయిలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వ అధికారులు మాత్రమే స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీతో కిరణ్ కుమార్ రెడ్డి కనిపించారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికారు ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా.. నెల కిందటే.. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news