మౌనిక మృతికి జీహెచ్ఎంసి నిర్లక్ష్యమే కారణం – కిషన్ రెడ్డి

-

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఉదయం కురిసిన భారీ వర్షానికి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడలో తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి చనిపోయింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మౌనిక డ్రైనేజీ లో పడి కొట్టుకుపోయింది. పార్క్ లైన్ వద్ద ఉన్న మౌనిక మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అయితే ఈ ఘటనపై తాజాగా స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

చిన్నారి మౌనిక మృతి బాధాకరమని అన్నారు. కాంట్రాక్టర్లకు జిహెచ్ఎంసి బకాయిలు చెల్లించకపోవడంతో నాళాల నిర్వహణ సరిగా లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత జిహెచ్ఎంసి దేనని అన్నారు. జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని ఆరోపించారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news