కేసీఆర్ ఆదేశాలతో గోదావరి ఎత్తిపోతలు షురూ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గోదావరి జలాల ఎత్తిపోతలు షురూ అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది, గాయత్రీ పంపుహౌసుల నుంచి అధికారులు ఎత్తిపోతలు ప్రారంభించారు. సుమారు 19వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మొదటి, రెండో దశల్లోని పంప్‌హౌస్‌లలో ఎక్కువ మోటార్లను నడుపుతున్నారు.

ఈ గోదావరి జలాలను మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట, మెదక్, సూర్యాపేట జిల్లాలకు గోదావరి నదీ జలాల తరలింపునకు నీటి పారుదల శాఖ చర్యలు చేపట్టింది. నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ గోదావరి జలాల ఎత్తిపోత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పథకంలోని మూడు పంపుహౌస్‌ల నుంచి సైతం గత నెలలో ఎగువకు ఎత్తిపోతలను తిరిగి ప్రారంభించారు. గతేడాది జులైలో గోదావరికి భారీ వరదలు రావడంతో లక్ష్మి, సరస్వతి పంపుహౌస్‌లలోని 12 పంపులు నీట మునిగాయి. వాటికి మరమ్మతులు చేసిన అనంతరం కొద్దిరోజుల కిందట ట్రయల్​ రన్‌ నిర్వహించి ఆ తర్వాత లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌ల నుంచి రెండు మోటార్ల చొప్పున నడిపిస్తూ శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి ఎత్తిపోతలు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news