హాస్పిటల్‌‌లో దారుణం.. కరోనాతో మృతి చెందిన మహిళ ఒంటిపై బంగారం మాయం..

-

కరోనా చిత్రాలు ఇంకా ఎన్నెన్ని చూడాలో.. మనిషికీ మనిషికీ మధ్య దూరం పెంచిన కరోనా.. మానవత్వాన్నిసైతం మింగేస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో కరోనాతో మృతి చెందిన ఓ మహిళ ఒంటిపై బంగారం కనిపించట్లేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న మహిళ చికిత్స నిమిత్తం హాస్పటల్‌లో అడ్మిట్‌ అవగా ఒక రోజు చికిత్స తరువాత మరణించింది. అయితే ఆమె ఒంటిపైన ఉన్న బంగారం కనిపించట్లేదని తెలుస్తోంది. వజ్రాల చెవి కమ్మలు, ముక్కుపుడక పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

హాస్పిటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే వారి నుండి సరైన సమాధానం రావడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరీ ఇంత ఘోరం ఎక్కడా చూడలేదని, చనిపోయిన వ్యక్తి  ఒంటిపైన ఉన్న బంగారాన్ని దోపిడి చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంగారం ఏమైందో తొందర్లోనే తెలుసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news