రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ నుంచి రూ.500 బోనస్..!

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తాజాగా హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్విటా వరికీ రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయని చెప్పారు.

ఒకటి, రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుంది. ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి, కరీంనగర్ కు ఆ రెండు పార్టీలు చేసింది ఏమి లేదన్నారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సిద్దమని బోయినపల్లి వినోద్ కుమార్ సిద్దమా అని సవాల్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కి ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news