బిగ్ బ్రేకింగ్: బ్యాలెట్ పద్దతిలోనే గ్రేటర్ ఎన్నికలు…!

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అని ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

అయితే ఎన్నికల తేదీలను ఇంకా ఎన్నికల సంఘం ప్రకటించలేదు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ ఎన్నికల మీద కాస్త ఎక్కువగా దృష్టి సారించాయి. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజారిటీ రాజకీయ పార్టీలు కోరాయి. 26 రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news