గుజరాత్ ఫలితాల ప్రభావం తెలంగాణ పై పడుతుంది – డీకే అరుణ

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. బిజెపి ఘనవిజయం సాధించడం పై ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. గుజరాత్ ప్రజలు బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయాన్ని కట్ట పెట్టారని అన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు డీకే అరుణ.

భారతీయ జనతా పార్టీ ఏడవసారి అఖండ విజయం సాధించడం చారిత్రాత్మకమన్నారు. బిజెపి ఉనికిని ప్రశ్నించిన వారు నేడు భారత రాజకీయ చిత్రపటం లో లేకుండా పోవడం బిజెపి అభివృద్ధి విధానాల విజయమన్నారు. ఇక గుజరాత్ ఫలితాల ప్రభావం తెలంగాణపై కచ్చితంగా పడుతుందని అన్నారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news