హనుమాన్‌ జయంతి సందర్భంగా ఇవాళ కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు ఇవాళ పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ముఖ్యంగా కరీంనగర్​లో ఇవాళ హిందూ ఏక్తా యాత్ర పేరిట హనుమాన్ శోభా యాత్రను నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనుంది. ఇందులో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొననున్నారు. కరీంనగర్​లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్​ నుంచి ఏక్తా యాత్ర ప్రారంభం అవుతుంది.

మరోవైపు జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజును పురస్కరించుకొని ఏటా పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు స్వామికి 108కిలోల పండ్లతో అభిషేకం, చమేలీ తైలంతో చందనాలంకరణ నిర్వహించారు. ఇవాళ స్వామికి యాగశాలలో స్థపన తిరుమంజనం, లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news