తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ఉగాది శుభాకాంక్షలు

-

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరయ్యారు కేటీఆర్. ఈ సందర్భంగా పంచాగం విన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చక్కని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని కోరారు. రైతులు బాగుండాలని.. రైతులు బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు. పండుగ వేళ తాను రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదని తెలిపారు. అందరూ బాగుంటే ఇలాంటి ఉగాది పండుగలను మరెన్నో జరుపుకోవచ్చన్నారు. ఈ ఉగాది వేడుకల్లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news