ధాన్యం కొనుగోలుపై హరీష్ రావు టెలికాన్ఫరెన్స్… ధాన్యం తడవకుండా చూడాల్సిన బాధ్యత వారిదే

-

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అసనీ తుఫాన్ కారణంగా తెలంగాణలో పలు  జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంపై మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు రావద్దని..చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రైతులను ఆదుకునేందుకు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో సేకరణ జరపాలని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవద్దని.. రైతులు ఆగం కావద్దని అలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులదే అని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతుల్ని కాపాడాలని హరీష్ రావు అన్నారు. గ్రామం వారీగా ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news