ప్రధాని మోదీ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

-

రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని తిడుతున్నారని మండిపడ్డారు. ఎవరు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. నీతి అయోగ్ చెప్పినా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, బిజెపి సర్కార్ ని ప్రశ్నిస్తే ఈడిని ప్రయోగిస్తారని ఆరోపించారు.

మీకు ఈడీలు, సీబీఐ ఉంటే మాకు ప్రజలు ఉన్నారని అన్నారు హరీష్ రావు. తెలంగాణకు మోడీ ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని.. తెలంగాణకు రావాల్సిన నిధులను మోడీ ఆపారని ఆరోపించారు. కేసీఆర్ కిసాన్ అజెండాతో బిజెపి సర్కార్ కి భయం మొదలైందని.. బీజేపీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news