రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రా..? బీజేపీ సీఎమ్మా : హరీశ్ రావు

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రా..? బీజేపీ సీఎంనా అని ప్రశ్నించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మెదక్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేవంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం అంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కవిత అరెస్ట్ సమంసజమంటున్నారు. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. అదానీ, అంబానీలు మోడీ దోస్తులు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ గాంధీ చెబితే.. గుజరాత్ మోడల్ సూపర్ అని రేవంత్ అంటున్నారని పేర్కొన్నారు.

బీజేపీతో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయేనని.. బీజేపీతో కలవనందుకే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. బీజేపీతో దోస్తాన్ ఎవ్వరో.. శత్రువు ఎవ్వరో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. బీజేపీకి ఓటు వేసినట్టేనని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు హరీశ్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముంచుడు ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news