ఎంపీ అరవింద్ పై హోలీ స్పెషల్ ట్వీట్..!

-

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా రాజకీయాల్లో చాలా కామన్ అనే చెప్పాలి. కానీ హోలీ పండగ వేళ..  బీజేపీ ఎంపీ అరవింద్ పై టీ-కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘ధర్మపురి అరవింద్ నిజాలు చెప్పని బాండ్ షా! అని ఈ ఎన్నికల్లో అరవింద్ కి రంగు పడాలే మల్లా’ అని ట్వీట్ చేసింది.

‘ఇగ ఈ ‘బాండ్ 005′ దైతే వేరే లెవల్..! మాటలతో మసిపూసి మారేడు కాయ చేయడంలో మాస్టర్..!! పసుపు బోర్డు తెస్తా అని బాండ్ ఇస్తడు..! నిజాం షుగర్ ఫ్యాక్టరీ సొంత పైసలతో తెరుస్తా అని హ్యాండ్ ఇస్తడు..!! చెప్పింది చేయకపోవడం.. చేయనివి చేసినా అని గొప్పలు చెప్పుకోవడం.. ఈయన గారి అసలు రంగును బయటపెడతాయ్..’ అని అరవింద్ ఫోటోను ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news