ఎంపీ నిధులతోనే నా కుమారుడి పెళ్లి చేశా – సోయం బాపూరావ్

-

బిజెపి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నిధులను కుమారుడి వివాహానికి, ఇంటి నిర్మాణానికి వాడుకున్నానని అన్నారు. దీంతో సోయం బాపూరావు తీరు వివాదాస్పదంగా మారింది. ఇటీవల బీజేపీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎంపీ లార్డ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే కారణంతో ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నానని అన్నారు. ఎంపీ నిధులతోనే తన కుమారుడి పెళ్లి చేశానని అన్నారు.

అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం వాస్తవమేనని.. అయితే గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల గోల్మాల్ చేయలేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కంటే తనకే నిధులు ఎక్కువగా వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసాయి. ప్రజల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను సొంతానికి ఎలా వాడుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. నిధుల దుర్వినియోగం చేసిన సోయం బాపూరావు పై చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news