ఆ విషయంలో ప్రధాని మోడీ బాటలో నడుస్తా.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.  తొలుత బండి సంజయ్ పేపర్ లీక్ చేశాడని కేటీఆర్ మీడియాతో చెప్పగా.. కేటీఆర్ పై బండి తూ.. నీ బతుకు.. డ్రగ్స్ దందా, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై కేటీఆర్ పై విమర్శలు చేశారు బండి సంజయ్. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి  కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు.

Bandi Sanjay answer on KTRs legal notice

తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడరని.. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ కి నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ నాకు లీగల్ నోటిస్ ఇస్తే.. నేను ఆయన మళ్లీ లీగల్ నోటీస్ పంపిస్తా. రాహుల్ గాంధీకి ప్రధాని లీగల్ నోటీస్ ఇవ్వలేదా..? లీగల్ నోటీసుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాటలో నడుస్తానని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news