నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ నాంపల్లి కోర్టులో కొండా సురేఖ పై  పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం దావా పై తాజాగా నాంపల్లి స్పెషల్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ఉన్నారు.

ఇటీవలే సినీ నటులు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. పలువురు హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. కేటీఆర్ వల్లనే కొంత మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు పలువురికి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ వాళ్ల జీవితాలతో ఆడుకొని.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా..? అంటూ ఆమె ప్రశ్నించారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో మమ్ముల్ని ఎందుకు లాగుతున్నారని కేటీఆర్ అడిగారు. కొండా సురేఖ పై  రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news