5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం చూపిస్తాం, హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రి ఘోరం…!

-

హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో దారుణంగా ఆడుకుంటున్నారు. తాజాగా మరో ఘటన హైదరాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ ఎం హాస్పిటల్ లో కోరుట్ల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని హాస్పిటల్ లో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు.

అతనికి కరోనా వచ్చిందంటూ 4 లక్షల రూపాయలు వసూలు చేసారు ఆస్పత్రిలో. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తేగాని నీ కుమారుడిని చూపిస్తానంటూ గత 10 రోజుల నుండి వాళ్ల కుమారుడిని చూపించకుండా తాత్సారం చేస్తున్నారు. అయితే అతనికి వైద్యం చేయకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో హాస్పిటల్ ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news