రెండో రోజు ఐటీ సోదాలు.. మంత్రి అల్లుడు ఇంటి ఎదుట టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

-

హైదరాబాద్​లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాలుగు వందలకుపైగా అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, ఇతర బంధువులు, ఆయనకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలలు, మెడికల్‌ కళాశాల, ఫార్మా కళాశాల, ఆస్పత్రితోపాటు ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయి.

కొంపల్లి, సుచిత్ర, దూలపల్లి, బోయనపల్లి, సూరారం, గండి మైసమ్మ తదితర ప్రాంతాలల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించిన స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి ఎంత ఆదాయం వస్తోంది.. ఎంత మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాలి.. ఇప్పుడు చెల్లిస్తున్నది ఎంత తదితర వివరాలను నిగ్గు తేల్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఐటీ వర్గాల సమాచారం మేరకు నగదు, బంగారం, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మంత్రి అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి ఇంట్లో నాలుగు కోట్ల రూపాయలతోపాటు ఇతర ప్రాంతాలల్లో కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇవాళ, రేపు కూడా సోదాలు కొనసాగేందుకు అవకాశం ఉందని చెబుతున్నఐటీ వర్గాలు ఈ సాయంత్రానికి సోదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news