నేను అప్పుడు, ఇప్పుడు సమైక్యవాదినే : జగ్గారెడ్డి

-

తాను అప్పుడు, ఇప్పుడు సమైక్యవాదినేనని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆరెస్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రే కదా..? అని బాల్క సుమన్ కు కౌంటర్ ఇచ్చారు. ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్ లొనే ఉన్నాడు కదా..? అని ప్రశ్నించారు. మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా స్వమైక్యవాదులే కదా..? అని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

ఉద్యమ సమయంలో టీఆరెస్ కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు టీఆరెస్ లొనే ఉన్నాడు కదా..? కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా మీ పరిపాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్ లే కదా పని చేస్తోందని స్పష్టం చేశారు. ఇది మీకు సిగ్గు అనిపించడం లేదా..?మరొక్కసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తానని హెచ్చరించారు జగ్గారెడ్డి.

మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ ఓయూ నాయకులు నీ సంగతి చూసుకుంటారు లే అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ని పదే పదే ఓయూ కి రావొద్దని మాట్లాడుతున్నారు.. మొన్నే చెప్పిన కదా ఓయూ మీ అయ్యా జగిరా అని అంటూ రెచ్చిపోయారు. నువ్వు రాహుల్ గాంధీ పట్ల మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news