ఈనెల 06న తుక్కుగూడలో జన జాతర సభ

-

ఏప్రిల్ 06న తెలంగాణ జన జాతర సభను నిర్వహించబోతున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. తాను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు జనజాతర సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికల ముందు బహిరంగ సభ నిర్వహించాం.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడుస్తున్నామని తెలిపారు. ఈ జనజాతర సభకు ప్రధాన నాయకులందరూ హాజరు అవుతున్నారని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. 

Read more RELATED
Recommended to you

Latest news