పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడంపై జానారెడ్డి సీరియస్

-

నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉప ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న విధానాలు ఈ సమాజానికి హాని కలిగిస్తాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపద్యంలో నెలకొన్న తాజా పరిస్థితిలపై ప్రజాస్వామ్యవాదులు నోరుతెరవలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటర్లు నడుము కట్టాల్సిన అవసరం ఉందన్నారు జానారెడ్డి. డబ్బు అధికారంతో వచ్చేవారికి పట్టం కడితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news