BRSకు మరో షాక్.. కీలక మహిళా నేత రాజీనామా ?

-

BRSకు మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కీలక మహిళా నేత రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లో సరిత, ఆమె భర్త తిరుపతయ్య భేటీ కాగా…కాంగ్రెస్ లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో కొల్లాపూర్ జూపల్లి చేరిక సభలో ఆమె కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మంలో పలువురు BRS ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

ఇది ఇలా ఉండగా, స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీలో మరోసారి ముసలం చోటు చేసుకుంది. తాజాగా సీనియర్ బీఆర్ఎస్ లీడర్ కడియం శ్రీహరి మీద తీవ్ర ఆరోపణలు చేశారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య.కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని… ఎన్ కౌంటర్ల సృష్టికర్త అంటూ రెచ్చిపోయారు. 2014 నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీలో ఉంటే.. ఇంకా నష్టాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news