వరంగల్ చేరుకున్న ప్రధాని మోడీ..దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రభుత్వం !

-

ఇవాళ తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. కాసేపటి క్రితమే.. వరంగల్‌ కు చేరుకున్నారు ప్రధాని మోడీ. ఇక మరి కాసేపట్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు మోడీ. భద్రకాళి ఆలయం నుంచి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి ప్రధాని మోడీ వెళతారు.

అయితే.. ఇక్కడే ప్రధాని మోడీకి కేసీఆర్‌ సర్కార్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రులు స్వాగతం పలకలేదు… అటు సీఎం కేసీఆర్‌ రాలేదు. మొదట తలసాని శ్రీనివాస్‌ మంత్రి స్థాయిలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వ అధికారులు మాత్రమే స్వాగతం పలికారు.

కాగా, నేడు వరంగల్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రూ. 6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నుంచి రైల్వే వరకు వివిధ రంగాల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని వివరించారు. వరంగల్ కు బయలుదేరుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news