jubilee hills rape case: నిందితులకు ‘ పొటెన్సీ’ టెస్ట్

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు.  ఈ రోజు ఏ-1 నిందితుడు మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యు బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లనున్నారు పోలీసులు. దీంతో పాటు నేరంలో కీలకంగా మారిన ఇన్నోవా కార్ దాచిపెట్టిన ప్రాంతానికి సైతం నిందితులను తీసుకెళ్లనున్నారు. 

ఇదిలా ఉంటే కేసు విచారణలో భాగంగా నిందితులకు ప్రభుత్వ వైద్యులతో ‘ పొటెన్సీ’ టెస్ట్ చేయించనున్నారు పోలీసులు. లైంగిక పటుత్వ నిర్థారణకు మైనర్లకు ఈ టెస్ట్ చేయించనున్నారు పోలీసులు. చార్జీషీట్ దాఖలుకు ఈ పరీక్ష కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల గత నేర చరిత్రపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. అత్యాచార ఘటనలో వాడిన ఇన్నోవా కారులో సాక్ష్యాధారులు తారుమారు చేశారా..? అనే కోనంలో కూడా విచారణ జరపనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news