బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకొమ్మని కేసీఆర్ చెప్పారంటూ.. జూపల్లి సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం కేసీఆర్ చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు సంచలనానికి తెరదీశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవమన్నారు. తనను బీజేపీ వాళ్ళతో లోపాయికారీ ఒప్పందం చేసుకొమ్మని కేసీఆర్ చెప్పారన్నారు.

కేసీఆర్ చెప్పినట్టు వినలేదు కాబట్టే తనకు అహంకారం అని అంటున్నాడన్నారు. కేసీఆర్‌కి బీజేపీతో ఎప్పటి నుంచో లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. తన ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుంది కాబట్టే తనను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. డిసెంబర్ 3న మూడు రంగుల జెండా ఎగురుతుందని జూపల్లి తెలిపారు. కాంగ్రెస్ లో టికెట్ రాణి వాళ్లకు డబ్బులు ఇస్తాం రండి అని మేనేజ్ చేసుకుంటుంది మీరు.

మీ లెక్క మేనేజ్మెంట్ చేయలేము మేము అని..  తెలంగాణ తెచ్చుకుంది అందుకునేనా దళిత బంధు అందరికి ఇచ్చావా..? Brs నేతలు దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్లలో 2 వేళా కోట్లు ఇవ్వలేని వాడు. 20 రోజుల్లో లక్ష కోట్లు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు జూపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news