అహంకారంలో కేసీఆర్ ని మించిన వాళ్ళు లేరు : జూపల్లి

-

అహంకారం లో కేసీఆర్ ని మించిన వాళ్ళు లేరని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. అహంకార పూరితంగా మాట్లాడుతుంది కేసీఆర్ అని.. డబ్బు అధికారం ఉందనే అహంకారంతోనే కదా.. కేసీఆర్ ఎమ్మెల్యే లను కొంటున్నావు అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన వ్యక్తి బీజేపీ నేత.. మాట్లాడటానికి బుద్ది ఉండాలి.  

అంబేద్కర్ కి పూల మాల కూడా వేయంది.. అహంకారం తోనే కదా  అని ప్రశ్నించారు.  ఒక్క అమర వీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించనిది అహకరం తోనే కదా.. ఎమ్మెల్యేలు,  మంత్రులను కూడా కలవకుండా అహంకారం తో ఉన్నది నువ్వు.. నా కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు..  ఏ విషయంలో నాకంటే గొప్పోడివి..  నీకు లేదు.. కాకపోతే నువ్వు సీఎం అయ్యావు.. నేను కాలేదు. నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్నావు..అహంకారం తో కాదా..? అని ప్రశ్నించారు జూపల్లి. పగటి వేశగాడి లెక్క.. ఎన్నికలు రాగానే వేషాలు మారుస్తున్నావు కేసీఆర్. ఢిల్లీకి పోతే.. దేశ పార్టీ అధ్యక్షుడు అయినా..రాహుల్, సోనియా లు కలుస్తారు..

కానీ ఇక్కడ మీరు గేట్ దాటనియ్యరు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో టికెట్ రాణి వాళ్లకు డబ్బులు ఇస్తాం రండి అని మేనేజ్ చేసుకుంటుంది మీరు..  మీ లెక్క మేనేజ్మెంట్ చేయలేము మేము.  తెలంగాణ తెచ్చుకుంది అందుకునేనా..?  దళిత బంధు అందరికి ఇచ్చావా..?  Brs నేతలు దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారు 

Read more RELATED
Recommended to you

Latest news