కాళేశ్వరం మొదటి పంప్ ట్రయల్ రన్ P. 9 విజయవంతం

-

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం విజయవంతం అయింది. కాళేశ్వరం మొదటి పంప్ ట్రయల్ రన్ P. 9 ఈరోజు ఉదయం విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మలక్ పెట్ లో నిర్మించిన ప్యాకేజ్ 9 లో మొదటి పంప్ ట్రయల్ రన్ విజయవంతం అయింది.

Kaleswaram

దీనిపై ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించిన మినిస్టర్ కేటీఆర్ కు ఇది గిఫ్ట్ అంటున్నారు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం అంటూ నిన్న విశ్వనగరంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల సేవలను కొనియడిన మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news