కల్వకుంట్ల కుటుంబం మనిషి పుట్టుకకే కళంకం తెస్తుంది – ఎంపీ అరవింద్

-

కల్వకుంట్ల కుటుంబం పై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. కల్వకుంట్ల కుటుంబం మనిషి పుట్టుకకే కళంకం తెస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. బాల్కొండ లో జరిగిన దాడికి మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ అక్రమ క్వారీని నిర్వహిస్తున్నారని.. వందల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. నంగనాచి ప్రశాంత్ రెడ్డి అంటూ విమర్శించారు. 50 సంవత్సరాల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వడ్డీ లేని రుణం కేంద్రం 5500 కోట్లు ఇచ్చిందన్నారు.

ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గం లో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పనులు చేసి, వాటిని కేంద్ర నిధులతో నిర్మించినట్లు కేంద్రానికి రిపోర్టులు పంపాడని ఆరోపించారు. సెంట్రల్ అసిస్టెంట్ డబ్బులు ఎక్కడ పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూస్ లెస్ ఫెలో హరీష్ రావు.. జిల్లాలో కడుతున్న ప్రతి మెడికల్ కాలేజ్ సెంట్రల్ అసిస్టెంట్ నిధులతోనే కడుతున్నారని అన్నారు. మా డబ్బులతోనే కడుతున్నామని హరీష్ రావు సిగ్గు లేకుండా అంటున్నాడని.. మీ మామ ఇస్తున్నాడా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news