కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటే : జగ్గారెడ్డి

-

కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటే అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని.. ఎక్కువ రోజులు ఉండదని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీకి చాలా నష్టం జరిగిందన్నారు విజయసాయిరెడ్డి.

ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. విజయసాయిరెడ్డికి తెలంగాణ ఏమి అన్యాయం చేసిందని ప్రశ్నించారు. ఓ వైపు ఆంధ్రాలో జగన్, మరోవైపు కేసీఆర్ ఇద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అందుకే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు జగ్గారెడ్డి. ఇక విజయసాయిరెడ్డి ఓ రాజకీయ బ్రోకర్ అని విమర్శించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీని విమర్శించే వారికి త్వరలోనే తమ ప్రభుత్వం కేంద్రంలో రాబోతుందని.. వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్, వైసీపీ రెండు కూడా బీజేపీ కోవర్టులుగా మారాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news