కేసీఆర్ సకల జనుల ద్రోహీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణ సీఎం కేసీఆర్ సకల ద్రోహీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా  కేసీఆర్  తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు విద్య ఏమైంది ఒక్కసారి చెబుతారో.. 2014, 2018, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏయే హామీలు ఇచ్చారో చెబుతారా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఒకసారి మీ మొఖం అద్దం ముందు పెట్టుకోండన్నారు. 

కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి. వరంగల్ లో టెక్స్ టైల్స్ సిటీ ఏర్పాటు చేస్తామని.. ఇంత వరక స్థలం కూడా చూపించలేదు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏమయ్యాయి. గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్ కి ఉత్తరాన ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. మూసీ నదికి పునర్జీవం చేస్తామన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news