ఆర్ఎస్ఎస్ ఏజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడు – కేఏ పాల్

-

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ 600 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ఎస్ ఎజెండాను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. తన కూతురు కవితను అరెస్టు నుంచి తప్పించేందుకే ఇదంతా చేస్తున్నారా? అని నిలదీశారు. కెసిఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నాడని, కెసిఆర్ బిజెపికి బీ టీం అని మరోసారి నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. కొండగట్టుకు నిధుల కేటాయింపు పై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు కోర్టులు మొట్టికాయలు వేసిన కేసీఆర్ మారడం లేదని విమర్శించారు. కొండగట్టు అభివృద్ధి కోసం ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news