ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

-

ఈ నెల 15 నుండి రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా అక్కడో ఇక్కడో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా,ఈ నెల 15 వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు.

మండలం ‘ కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవో ల ఆధ్వర్యం లో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వం లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు. సదస్సుల నిర్వహణ కు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11 వ తేదీన ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరుగుతుంది.ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news