ఎగ్జిట్‌ ఫలితాలపై కేసీఆర్‌ కీలక ప్రకటన..బీఆర్‌ఎస్‌కు 11 పక్కా ?

-

ఎగ్జిట్‌ ఫలితాలపై కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో గెలిచాం..హీరోలాగా రాకేష్‌ రెడ్డి గెలుస్తున్నాడు అంటూ కేసీఆర్‌ ప్రకటించారు. ఈరోజు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ గెలిచాం… ఇంకో ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నామని వెల్లడించారు. మనకు 11 వస్తాయి అని ఒకరు, 1 వస్తుంది అని మరొక సర్వేలు చెబుతున్నాయి… ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు అని వివరించారు.

kcr on exit polls

ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం… ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కుదుట పడిందని వెల్లడించారు. ఇక జనాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ పోతే హరీష్ రావు లైన్ మెన్ లతో మాట్లాడి అపుతున్నాడు అని సీఎం అంటున్నాడు…. సీఎం రేవంత్ రెడ్డి యా…హరీష్ రావు ఆ…అంటూ ఫైర్‌ అయ్యారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు కేసీఆర్‌. అధ్బుతమైన పథకాలు ఉండేవి.. వాటిని కొనసాగించడం లేదన్నారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news