BREAKING : ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన కేసీఆర్‌ సర్కార్‌

-

ఇవాళ సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాలు ప్రారంభం అయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా తొలి బోనం సమర్పించారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని మొదటి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల కిందట నుంచి ఆనవాయితీగా సెంటిమెంట్ గా వస్తున్న జాతర అన్నారు.

సికింద్రాబాద్ లో స్థలం చాలా చిన్నగా ఉన్నా లక్షలాదిమంది భక్తులు వచ్చి బోనాలని సమర్పించుకుంటారు చాలా సెంటిమెంట్ గా భావిస్తారని వివరించారు. హైదరాబాద్ మొత్తం కొన్ని వేలలో ఆలయాలు ఉన్నా కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రత్యేకత అన్నారు. ఈరోజు ఉదయం నాలుగు గంటలకి మొదటి పూజ ప్రారంభమైంది రేపు రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతూ ఉంటుందని.. ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కేసీఆర్ గారి ఆలోచనలతో ఆర్థిక సహాయం జరుగుతోందని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news