నెక్లెస్ రోడ్‌కు పీవీ పేరు : కేసీఆర్

-

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌ ఇకపై పీవీ జ్ఞాన మార్గ్‌గా మరబోతుంది. అలాగే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ కూడా నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సమీక్షలో పలు విషయాలపై చర్చించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌కు పీవీ జ్ఞాన మార్గ్‌గా పేరు పెట్టాలని నిర్ణయం సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్ అన్నారు. అదేవిధంగా పీవీ పుట్టి పెరిగిన లక్నెపల్లి, వంగర లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదనలు సైతం పంపుతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news