కేసీఆర్ శేష జీవితాన్ని చర్లపల్లి జైలులో గడుపుతారు – పొన్నాల లక్ష్మయ్య

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ టీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. నేడు హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన తుక్కుగూడలో జరిగే సోనియా గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఘన స్వాగతం పలకాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండాలని సూచించారు. 2014 ఎన్నికలలో చేసిన వాగ్దానాలను కేసీఆర్ ఒక్కటైనా అమలు చేశాడా..? అని ప్రశ్నించారు.

నీటి రాజకీయం చేస్తున్న కేసీఆర్ ని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. రైతులను అన్ని విధాల ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎర్రవెల్లి నుంచి చర్లపల్లి కి కేసీఆర్ ని పంపిస్తామని అన్నారు. కెసిఆర్ శేష జీవితాన్ని చర్లపల్లి జైలులోనే గడుపుతారని అన్నారు. కల్వకుంట్ల కవితకు నోటీసుల పేరుతో రెండు పార్టీలు హైడ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదన్నారు పొన్నాల లక్ష్మయ్య. చివరికి కేసీఆర్ దేవుళ్ళ పేరు చెప్పి కూడా దోచుకున్నాడని ఆరోపించారు. దోపిడీ చేసిన సొమ్ముతోనే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచే పోటీ చేస్తానని.. జనగామలోనే చస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news