తెలంగాణ శ్వాసగా.. ఆశ గా బతుకుతున్న : కేసీఆర్

-

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆకలి చావులే అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గ‌త 24 ఏండ్లుగా తెలంగాణ ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను, కృషి చేశాను. అవ‌న్నీ ప్ర‌జ‌ల కండ్ల ముందు క‌న‌బ‌డుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒక‌సారి చెప్పాలి. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను. కృషి చేశాను. అవ‌న్నీ ప్ర‌జ‌ల కండ్ల ముందు క‌న‌బ‌డుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చేట‌టువంటి ట్రిపుల్ ఆర్ కూడా మ‌న గ‌జ్వేల్ మీదుగానే రాబోతుంద‌ని సంతోషంగా తెలియ‌జేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణ‌నే ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాను. ఆ విష‌యం మీ అంద‌రికి తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news