BREAKING : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి

-

బ్రేకింగ్ : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయింది. కాసేపటి క్రితమే.. గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గణపతిని నిమజ్జనం చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. హుస్సేన్ సాగర్ పరిధిలోని.. నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ మహాగణపతిని నిమజ్జనం చేశారు అధికారులు.

ఈ నిమజ్జనం చాలా ప్రశాంతంగా, భక్తులకు, ఆహ్లాదాన్ని అందించేలా జరిగింది. ఈ ఏడాది పంచముఖ అవతారంలో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ విగ్రహం… నిమజ్జనం చూసేందుకు హైదరాబాద్ మహానగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు చేరుకున్నారు భక్తులు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ లంబోదరుడి.. నిమజ్జనానికి భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news