కమ్మ మంత్రి అయిన నాపై కుట్ర చేస్తున్నారు… ఖమ్మం ఘటనపై మంత్రి పువ్వాడ స్పందన

-

ఖమ్మంలో ఓ చిన్న ఘటన జరిగింది. ఈ ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల ఖమ్మంలో జరిగిన సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ స్పందించినట్లు తెలుస్తోంది. కమ్మ మంత్రి అయిన నాపై కుట్ర చేస్తున్నారని… కుట్ర చేసేవారితో చాలా మంది చేతులు కలిపారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రులు చేసే వారంతా ఏకం అవుతున్నారని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కమ్మ మంత్రిని నేనే అని… కమ్మవారికి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుందని ఆయన అన్నారు. ఇది తట్టుకోలేకే కొంతమంది మనవర్గాన్ని దించివేయడానికి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. కొంతమంది సూడో చౌదరిలుగా ఉన్న వారు కూడా ఈ కుట్రకు మద్దతు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మనలో ఉన్నవారే కొంతమంది ఈ కుతంత్రాలకు మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపించారు. విభజించి పాలించే కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. గతంలో రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news