మంత్రి, పోలీస్ అధికారులు జైలుకు వెళ్లక తప్పదు… ఖమ్మం ఘటనపై కిషన్ రెడ్డి హెచ్చరిక

-

ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మంత్రి, పోలీసులు కలిసి సాయిగణేష్ ను వేధించారని విమర్శించారు. పోలీసులు చిన్న కార్యకర్తపై ఎందుకు అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని…అనేక మంది మహానుభావులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారని.. ఎవరి కుటుంబాలు శాశ్వతంగా లేవని… ఇది ఏం నిజాం పరిపాలన కాదని కిషన్ రెడ్డి అన్నారు. మేమే శాశ్వతంగా ఉంటాం.. మా పార్టీ శాశ్వతం, మాకుటుంబమే శాశ్వతం అనుకుంటే పొరపాటు అని ఆయన అన్నారు. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు రావడానికి ఇది నిజాం రాజ్యాంగం కానది.. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో సాయి గణేష్ పై జరిగిన దౌర్జన్యకాండ, హత్య కాండపై న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఘటన వెనక ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసులపై కేసులు పెట్టాల్సిందే అని… వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సిందే అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news